BREAKING
ప్రత్యేక ప్రచారం 6: ఇ-వ్యర్థాల నిర్వహణ, పెండింగ్ పనుల పరిష్కారానికి పోర్టల్ ప్రారంభం గాంధీనగర్‌లో ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026’ ప్రారంభం 2028లో భారత్‌లోకి ఫార్ములా వన్ పునరాగమనం? శరత్‌చంద్ర చటోపాధ్యాయ 150వ జయంతి ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు నూతన ఆర్ఐ అశోక్ కు ఎస్పీ శుభాకాంక్షలు కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా… పదోన్నతి పొందిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం వాడవాడలా వెలసిన గణపయ్యలు యూకే వీసాల మోసం కేసులో యూట్యూబర్ రమానందన విచారణ.. పోలీసుల ముందు విచిత్రమైన డిమాండ్ రైల్వే స్టేషన్ల పేర్ల వెనుక ఆసక్తికరమైన విషయాలు.. జంక్షన్, రోడ్డు, టెర్మినస్‌లకు అర్థం ఇదీ! అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

కార్పొరేటర్‌ను బయటకు పంపించారా? రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా…

Select Suryaa Now
కార్పొరేటర్‌ను బయటకు పంపించారా?   రామగుండం నగర కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్పొరేటర్ల ధర్నా…

సూర్య-గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. తన డివిజన్ పరిధిలోని పెండింగ్‌ సమస్యలపై వివరాలు తెలుసుకునేందుకు కమిషనర్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జె.అరుణశ్రీని కలిసేందుకు వెళ్లిన స్థానిక 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ కౌటం సతీష్‌ను అటెండర్‌ ద్వారా బయటకు పంపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి కార్పొరేటర్లు కమిషనర్‌ చాంబర్‌ ఎదుట రాత్రి 8 గంటల సమయంలో ధర్నాకు దిగారు. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌ లతో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం ధర్నాలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్‌తో వ్యవహరించిన తీరుపై కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.