వాడవాడలా వెలసిన గణపయ్యలు
ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్
పూడూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 15): వినాయకుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సొసైటీ వైస్ చైర్మన్ సురేందర్ ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం మండల పరిధిలోని ఏన్కేపల్లి గ్రామంలో ఆదర్శ మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరికీ వినాయకుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్, మాజీ ఉపసర్పంచ్ నరేందర్, వార్డు సభ్యుడు ప్రసాద్ గౌడ్, యువజన అధ్యక్షుడు నవీన్, శివ, శ్రీశైలం, ప్రేమ్ సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.