BREAKING
ప్రత్యేక ప్రచారం 5.0లో 95% ఫైళ్ల సమీక్ష దేశవ్యాప్తంగా 150 గతి శక్తి కార్గో టెర్మినళ్లు ప్రారంభం 'నువాఖై' పండుగ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు పైడికాలువలో ఘనంగా వినాయక చవితి.. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలి రైతులు సుభిక్షంగా ఉండాలి - పాడిపంటలు సమృద్ధిగా పండాలి పూజా కార్యక్రమంలో - ఆకుల శ్రీనివాసులు.. గాల్లో విమానం.. బట్టలు విప్పేసి ప్రయాణికురాలి హల్‌చల్: మియామిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సౌదీ అరేబియాలో కొత్త భద్రతా హెచ్చరికలు ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగనీరు P2P లావాదేవీలు, 96% వ్యాపారి చెల్లింపులకు UPI ఉచితం ప్రత్యేక ప్రచారం 6: ఇ-వ్యర్థాల నిర్వహణ, పెండింగ్ పనుల పరిష్కారానికి పోర్టల్ ప్రారంభం గాంధీనగర్‌లో ‘ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026’ ప్రారంభం 2028లో భారత్‌లోకి ఫార్ములా వన్ పునరాగమనం? శరత్‌చంద్ర చటోపాధ్యాయ 150వ జయంతి ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలతో జీవో జారీ! బిల్లులు చెల్లించలేదని ఎంపీడీవో కార్యాలయంలో మాజీ సర్పంచ్ ఆందోళన గణనాథునికి బుట్టా రేణుక విశేష పూజలు

ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగనీరు

Select Suryaa Now
ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగనీరు

ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటల తాగునీరు.. ఎమ్మెల్యే బీవీ 

 ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి

ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ₹156.70 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి  రాళ్లదొడ్డి, ఎర్రకోట గ్రామాల సమీపంలో ఎమ్మిగనూరు పట్టణ ప్రవేశం వద్ద జరుగుతున్న పైప్‌లైన్ పనులను పరిశీలించారు. శంకుస్థాపన అనంతరం పనులు వేగంగా కొనసాగుతున్న తీరును పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మాజీ మంత్రి స్వర్గీయ బి.వి. మోహన్ రెడ్డి  చిరకాల స్వప్నమైన ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటల తాగునీటి సరఫరాను సాకారం చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక అడుగు అని ఎమ్మెల్యే డాక్టర్ బివి పేర్కొన్నారు.

గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎమ్మిగనూరు పట్టణానికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది అన్నారు.