BREAKING
వెటర్నరీ డాక్టర్ నియామకానికి దేవాదాయ శాఖ అంగీకారం Sir పేరుతో అధికారులు మాయం.... కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల అఫ్గానిస్థాన్‌పై సిరీస్ విజయాన్ని ఖరారు చేసిన భారత్ భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ను ధ్వంసం చేసిన సౌదీ సంకీర్ణ కూటమి ఫెడ్ నిర్ణయానికి ముందు ఆందోళనలో ఆసియా మార్కెట్లు 2029 నాటికి ‘స్వచ్ఛ యమున’ లక్ష్యం సాకారం: అమిత్ షా దీపావళి కానుకగా నయనతార ‘మహాశక్తి’ వరల్డ్ వైడ్ రిలీజ్! అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సందీప్ కిషన్ ‘సిగ్మా’ గ్రాండ్ రిలీజ్! జీవిత సత్యాలు, ప్రశాంతత కోసం గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం! హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవ కమిటీలకు షాక్: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ! రష్యా చమురు దిగుమతులపై అమెరికా దృష్టి: వంద శాతం టారిఫ్ బిల్లుకు హౌస్ ఆమోదం! అష్టాక్షరీ మంత్ర విశిష్టత.. సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే 'ఓం నమో నారాయణాయ' జప మహిమ సంచలన విజయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు: నేటి పసిడి, వెండి మార్కెట్ సరళి!

Sir పేరుతో అధికారులు మాయం.... కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల

Select Suryaa Now
Sir పేరుతో అధికారులు మాయం.... కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల

SIR పేరుతో అధికారులు మాయం.. కార్యాలయాలకు వచ్చి ప్రజలు విలవిల

పనుల కోసం వచ్చిన ప్రజలకు నిరాశే మిగిలింది

తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కోసం పడిగాపులు

బషీరాబాద్, మేజర్ న్యూస్: SIR విధుల పేరుతో అధికారులు కార్యాలయాలకు గైర్హాజరవుతున్నారనే ఆరోపణలు బషీరాబాద్ మండలంలో చర్చనీయాంశంగా మారాయి. తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రతిరోజూ ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ పనులు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి నిరీక్షించి చివరకు పనులు కాకుండానే వెనుదిరుగుతున్నారని వాపోతున్నారు.

SIR ప్రక్రియలో అధికారులు విధులు నిర్వహించడం తప్పనిసరైనప్పటికీ, సాధారణ పరిపాలనా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో కార్యాలయాలకు వచ్చిన తర్వాత అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల తమ సమయం, డబ్బు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలకు అత్యవసరంగా అవసరమయ్యే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోకుండా అధికారులు నిర్దిష్ట సమయాల్లో కార్యాలయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. SIR విధులతో పాటు ప్రజా సేవలకు కూడా ప్రాధాన్యం కల్పించేలా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.