BREAKING
భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ను ధ్వంసం చేసిన సౌదీ సంకీర్ణ కూటమి ఫెడ్ నిర్ణయానికి ముందు ఆందోళనలో ఆసియా మార్కెట్లు 2029 నాటికి ‘స్వచ్ఛ యమున’ లక్ష్యం సాకారం: అమిత్ షా దీపావళి కానుకగా నయనతార ‘మహాశక్తి’ వరల్డ్ వైడ్ రిలీజ్! అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సందీప్ కిషన్ ‘సిగ్మా’ గ్రాండ్ రిలీజ్! జీవిత సత్యాలు, ప్రశాంతత కోసం గౌతమ బుద్ధుడు బోధించిన మార్గం! హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవ కమిటీలకు షాక్: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ! రష్యా చమురు దిగుమతులపై అమెరికా దృష్టి: వంద శాతం టారిఫ్ బిల్లుకు హౌస్ ఆమోదం! అష్టాక్షరీ మంత్ర విశిష్టత.. సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే 'ఓం నమో నారాయణాయ' జప మహిమ సంచలన విజయంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు: నేటి పసిడి, వెండి మార్కెట్ సరళి! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం, వెండి ధరలు: కొనుగోలుదారులకు ముఖ్య గమనిక! హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి… యూపీఐ సుస్థిరతకే ఎమ్‌డీఆర్ ఫ్రేమ్‌వర్క్: ఆర్‌బిఐ స్పష్టత

భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం

Select Suryaa Now
భారత్-న్యూజిలాండ్ వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్ ఆమోదం

వెల్లింగ్టన్:భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) అమలు చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని న్యూజిలాండ్ పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు జరిగే న్యూజిలాండ్ ఎగుమతులలో సుమారు 95 శాతం వస్తువులపై సుంకాలు పూర్తిగా తొలగించబడతాయి లేదా గణనీయంగా తగ్గించబడతాయి. ప్రతిపక్ష లేబర్ పార్టీ మద్దతుతో ఈ చట్టం 93-29 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఇది అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే, పరిధిలోకి వచ్చే సగానికి పైగా ఉత్పత్తులు సుంకరహితంగా మారనున్నాయి.

ఈ ఒప్పందం ద్వారా ఎగుమతిదారులకు తక్షణమే గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని న్యూజిలాండ్ వాణిజ్య మంత్రి టాడ్ మెక్‌క్లే తెలిపారు. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేస్తామన్న తమ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని, ఈ నాణ్యమైన ఒప్పందం ఈ ఏడాదే అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ప్రకారం అన్ని భారతీయ వస్తువులకు న్యూజిలాండ్‌లోకి సుంకరహిత ప్రవేశం లభించనుంది. అంతేకాకుండా, రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కూడా న్యూజిలాండ్ అంగీకరించింది. ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

జూన్ 2026 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మొత్తం 3.99 బిలియన్ న్యూజిలాండ్ డాలర్లకు (సుమారు 2.29 బిలియన్ అగ్రరాజ్య డాలర్లు) చేరింది. భారతదేశం న్యూజిలాండ్‌కు తొమ్మిదవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా నిలిచింది. ఇరు దేశాల్లో అధికారిక ఆమోద ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.