BREAKING
అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంవత్సరి పర్వదినాన ప్రధాని మోదీ శుభాకాంక్షలు కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి చెరకు రైతులకు తీపి కబురు లడఖ్‌లో ఘనంగా 'హెచ్‌డిఎస్ఆర్ స్టార్ పార్టీ' బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ పునరుద్ధరణ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. తెల్లవారుజామునే టెర్మినేషన్ మెయిల్స్ ఆగస్టులో వాహన విక్రయాల జోరు సెమికాన్ ఇండియా 2026 రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఊతం పిల్లల రక్షణే మా ప్రాధాన్యత శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి AI సాంకేతికత అందుబాటు ధరలో హెల్త్‌కేర్ సేవలు మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా భారత్ వ్యూహాలు

ఏఐతో మానవాళికి తీవ్ర ప్రమాదం

Select Suryaa Now
ఏఐతో మానవాళికి తీవ్ర ప్రమాదం

గూగుల్ డీప్‌మైండ్ మాజీ పరిశోధకుడి హెచ్చరిక
లండన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత మానవులందరినీ అంతం చేయగలదని గూగుల్ డీప్‌మైండ్ మాజీ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని నివారించడానికి సమయం మించిపోతోందని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సురక్షితమైన ఏఐ అభివృద్ధికి సమన్వయం అవసరమని, తీవ్రమైన హాని జరగకముందే ప్రమాదాలను అరికట్టేలా ఈ రంగంలో పురోగతి సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఈ దశాబ్దం చివరి నాటికి ఏఐ వల్ల మానవాళికి ప్రమాదం ఉందనే ఆందోళనతో రాజీనామా చేయగా, మరో శాస్త్రవేత్త ఇవాన్ హుబింగర్ కూడా రాబోయే దశాబ్దంలో ఏఐ మానవులను తుడిచిపెట్టేందుకు 10 శాతానికి పైగా అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఎలాన్ మస్క్, ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని అభిప్రాయపడగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏఐ నియంత్రణ పిలుపులను బూటకంగా కొట్టిపారేశారు.