ఏఐతో మానవాళికి తీవ్ర ప్రమాదం
గూగుల్ డీప్మైండ్ మాజీ పరిశోధకుడి హెచ్చరిక
లండన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత మానవులందరినీ అంతం చేయగలదని గూగుల్ డీప్మైండ్ మాజీ పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాన్ని నివారించడానికి సమయం మించిపోతోందని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సురక్షితమైన ఏఐ అభివృద్ధికి సమన్వయం అవసరమని, తీవ్రమైన హాని జరగకముందే ప్రమాదాలను అరికట్టేలా ఈ రంగంలో పురోగతి సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఈ దశాబ్దం చివరి నాటికి ఏఐ వల్ల మానవాళికి ప్రమాదం ఉందనే ఆందోళనతో రాజీనామా చేయగా, మరో శాస్త్రవేత్త ఇవాన్ హుబింగర్ కూడా రాబోయే దశాబ్దంలో ఏఐ మానవులను తుడిచిపెట్టేందుకు 10 శాతానికి పైగా అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్, ఎలాన్ మస్క్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని అభిప్రాయపడగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏఐ నియంత్రణ పిలుపులను బూటకంగా కొట్టిపారేశారు.