BREAKING
వారణాసిలో రూ.10,998 కోట్లతో 'వరుణా ఎలివేటెడ్ కారిడార్' చమురు ధరల మంట, వడ్డీ రేట్ల భయాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమపాళ్లలో సాగాలి అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంవత్సరి పర్వదినాన ప్రధాని మోదీ శుభాకాంక్షలు కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి చెరకు రైతులకు తీపి కబురు లడఖ్‌లో ఘనంగా 'హెచ్‌డిఎస్ఆర్ స్టార్ పార్టీ' బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ పునరుద్ధరణ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. తెల్లవారుజామునే టెర్మినేషన్ మెయిల్స్ ఆగస్టులో వాహన విక్రయాల జోరు సెమికాన్ ఇండియా 2026 రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఊతం పిల్లల రక్షణే మా ప్రాధాన్యత

సెమికాన్ ఇండియా 2026

Select Suryaa Now
సెమికాన్ ఇండియా 2026

సెమీకండక్టర్ల తయారీ, డిజైనింగ్ రంగాల్లో భారత్ చారిత్రాత్మక ముందడుగు
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో ద్వారకాలోని యశోభూమిలో 'సెమికాన్ ఇండియా 2026' ప్రదర్శనను సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. "సిలికాన్ టు సిస్టమ్స్: బిల్డింగ్ ది ఎకోసిస్టమ్" అనే ఇతివృత్తంతో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ చిప్ తయారీదారులు, పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలు పాల్గొననున్నారు.

గత దశాబ్ద కాలంలో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రూ. 1.9 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 13.11 లక్షల కోట్లకు చేరగా, అందులో స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు అతిపెద్ద వృద్ధిని నమోదు చేశాయి. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2021లో ప్రారంభించిన 'సెమికాన్ ఇండియా' ప్రోగ్రామ్‌కు కొనసాగింపుగా, జూలై 2026లో ప్రభుత్వం రూ. 1.27 లక్షల కోట్లతో 'సెమికాన్ ఇండియా 2.0'కు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు రూ. 1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో ఆరు రాష్ట్రాల్లో 12 ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటుండగా, మూడు ఉత్పత్తి కేంద్రాలు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి.

మరోవైపు చిప్ డిజైన్, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధికి భారత్ పెద్దపీట వేస్తోంది. ఈ దశాబ్దంలో 85,000 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా 'చిప్స్ టు స్టార్టప్' (C2S), DLI పథకాలను అమలు చేస్తోంది. సి-డాక్ (C-DAC) ఆధ్వర్యంలోని 'చిప్‌ఇన్ సెంటర్' ద్వారా వందలాది విద్యార్థులు, స్టార్టప్‌లు అధునాతన చిప్ డిజైన్ టూల్స్‌ను ఉచితంగా పొందుతున్నారు. భారతదేశంలో తయారైన 211 చిప్‌లు ఇప్పటికే టేప్-అవుట్ అవ్వడం విశేషం. అంతేకాకుండా ఇటీవల భారత్ అధికారికంగా 'పాక్స్ సిలికా' కూటమిలో చేరడం ద్వారా అంతర్జాతీయ చిప్ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఆవిర్భవిస్తోంది.