BREAKING
అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమపాళ్లలో సాగాలి అభివృద్ధి, సంక్షేమంలో నెల్లూరును రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలపాలి -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంవత్సరి పర్వదినాన ప్రధాని మోదీ శుభాకాంక్షలు కోవూరుకు నారా లోకేష్‌ .. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు - కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి చెరకు రైతులకు తీపి కబురు లడఖ్‌లో ఘనంగా 'హెచ్‌డిఎస్ఆర్ స్టార్ పార్టీ' బనవాసి నవోదయను పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ పునరుద్ధరణ ఐటీ దిగ్గజం ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. తెల్లవారుజామునే టెర్మినేషన్ మెయిల్స్ ఆగస్టులో వాహన విక్రయాల జోరు సెమికాన్ ఇండియా 2026 రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు ఊతం పిల్లల రక్షణే మా ప్రాధాన్యత శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి AI సాంకేతికత అందుబాటు ధరలో హెల్త్‌కేర్ సేవలు

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

Select Suryaa Now
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఆరుగురు పిల్లలతో సహా 13 మంది మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్‌లోని పట్టణాలపై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఆరుగురు చిన్నారులతో సహా కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కఫర్ రుమ్మన్ పట్టణంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న భవన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడానికి సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఓ పౌర వాహనంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక వైద్యుడు కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.

జూన్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడంతో ప్రాంతీయంగా యుద్ధ మేఘాలు మళ్లీ అలుముకుంటున్నాయి. ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారంతోనే తాము ఖచ్చితమైన లక్ష్యాలపై దాడి చేశామని, పౌరుల మృతికి సంబంధించిన నివేదికలను సమీక్షిస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకుని తమ రెండు డ్రోన్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.

మార్చి నుంచి ప్రారంభమైన ఇజ్రాయెల్ సైనిక చర్యలు, వైమానిక దాడుల కారణంగా లెబనాన్‌లో ఇప్పటివరకు 4,300 మందికి పైగా పౌరులు మరణించగా, అందులో 250 మందికి పైగా చిన్నారులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది. పౌరులను ఖాళీ చేయమని ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండానే ఈ దాడులు జరిగాయని స్థానికులు వాపోతున్నారు.