జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి
జిల్లాలో 4500 గణనాథులు నిమజ్జనం.. ఎస్పీ క్రాంతి పాటిల్
ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
గణేష్ ఉత్సవాలు భాగంగా మూడవరోజు 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం అవుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరులోని తుంగభద్ర దిగువ కాలువ దగ్గర వినాయకుల నిమజ్జనాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో జరుగుతున్న మూడవరోజు వినాయక నిమజ్జనం ఉత్సవంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు