ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
21 ఎంపీటీసీ స్థానాలు.. 67 పోలింగ్ కేంద్రాలు
59,816 మంది ఓటర్లు
గోనెగండ్ల: మండలంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు మండల పరిషత్ సమూహ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీవో మణిమంజరి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 59,816 మంది ఓటర్ల కోసం 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు వివరించారు. కేంద్రాల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాల సహకారం అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.