ఎమ్మిగనూరు జేఎస్పీలో మార్పులు,,,,?
ఎమ్మిగనూరు జేఎస్పీలో మార్పులు..?
.. నియోజకవర్గ కన్వీనర్ గా చల్లా కు
ఛాన్స్
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ సత్తా చాటాలని చూస్తుంది.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక పోరు నుండి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఎమ్మిగనూరు జనసేన పార్టీ కన్వీనర్ గా ఉన్న రేఖ గౌడ్ ను తొలగించి ఆ స్థానంలో చల్లా వరుణ్ ను కూర్చో పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది.. ఇప్పటికే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా కొనసాగుతున్న రేఖ గౌడ్ ఎమ్మిగనూర్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జనసేన ను బలోపేతం చేయడంలో విఫలం చెందారని పార్టీ గ్రహించడం జరిగిందని సమాచారం.. ఈ నేపథ్యంలోనే ఎమ్మిగనూరు పార్టీ పగ్గాలు మార్చే యోచన లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.. కూటమి పాలనలో ఒప్పందం ప్రకారం సీట్లు కేటాయిస్తే కనీసం మున్సిపాలిటీలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే జనసేన అభ్యర్థుల నియమించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని స్థానిక జన సైనికులు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు మార్పు జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల వైపు జనసైనికులు ముందుకు వస్తారని యోచ నలో పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి కృషి చేసే నాయకత్వం వైపు ఆలోచించిన అధిష్టానం మార్పులువైపే అడుగులు వేస్తుంది.. ఒకవేళ ఈ మార్ప జరిగితే నైనా జనసైనికులు ఉత్సాహం నిండుతుందో లేదో వేచి చూడాలి..