మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు* *శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం*
ధర్మవరం, సెప్టెంబర్ 16:
ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ముందుగా శివానగర్లోని శివాలయంలో పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ధర్మవరం నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేయించారు.ఎన్డీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా పాల్గొని భక్తులకు, ప్రజలకు భోజనాలు వడ్డించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వేడుకల్లో కూటమి నాయకులు, అభిమానులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.