BREAKING
‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి నెట్ జీరో పోర్టల్, నాప్సీసీ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాకిస్థాన్ నౌకాదళం నిర్లక్ష్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం సాంప్రదాయ కళాకారుల అభివృద్ధికి పీఎం విశ్వకర్మ పథకం ఉత్సాహభరితమైన భవిష్యత్తుకు అధికార సమతుల్యతే కీలకం ఘనంగా ‘ఆస్మాన్’ టీజర్ లాంచ్.. హాజరైన మంచు మనోజ్, శివాత్మిక పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయనున్న ‘సిగ్మా’.. ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర విశేషాలు వెల్లడించిన చిత్ర యూనిట్ భక్తులకు తాగునీరు సరఫరా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ చిత్రం నుంచి ‘ఏదో బాగుందే’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు మంత్రి సత్య కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు* *శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం* అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 విజేతగా డ్రాగన్ 11* * *రన్నరప్‌గా పెనుకొండ జట్టు; విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్* దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం!

పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం

Select Suryaa Now
పీఎఫ్‌ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి అదనపు ప్రయోజనం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014 తర్వాత తొలిసారిగా ఈ పరిమితిని సవరించారు. ఈ నిర్ణయంతో అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు పీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. 

పీఎఫ్‌తో పాటు పెన్షన్‌, బీమా ప్రయోజనాలు

వేతన పరిమితి పెంపుతో ఇప్పటివరకు పీఎఫ్‌ పరిధికి వెలుపల ఉన్న కొంతమంది ఉద్యోగులు ఉద్యోగుల భవిష్యనిధి, ఉద్యోగుల పెన్షన్‌, ఉద్యోగుల డిపాజిట్‌ అనుసంధానిత బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాల పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం ఉన్న 12 శాతం చొప్పున ఉద్యోగి, యజమాని వాటాల విధానం కొనసాగనుంది. 

ఏటా రూ.11,339 కోట్ల వ్యయం

వేతన పరిమితిని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడనుంది. ఈ విస్తరణకు ప్రభుత్వం ఏటా సుమారు రూ.11,339 కోట్లు ఖర్చు చేయనుంది. తాజా నిర్ణయంతో సామాజిక భద్రతా పరిధి మరింత విస్తరించనుంది. 

2014లో చివరిసారిగా పెంపు

ఉద్యోగుల భవిష్యనిధి పథకంలో వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.15 వేలకు పెంచారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి పరిమితిని రూ.25 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న వేతనాలు, అధికారిక ఉద్యోగాల విస్తరణకు అనుగుణంగా సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.