'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పిలుపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోరుతూ "ఆశీర్వాద్ కా దీయం" (ఆశీర్వాదపు మట్టి దీపం) వెలిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దీపం వెలిగించి ప్రార్థనలు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో సేవ, సుపరిపాలన మరియు పేదల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా రూ. 13,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 'విక్సిత్ ఢిల్లీ' ద్వారా 'విక్సిత్ భారత్' సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.