BREAKING
రజనీకాంత్ ‘ధర్మన్’ మూవీపై క్రేజీ అప్డేట్.. వెల్లడించిన దర్శకుడు! పెట్రోలియం డీలర్ల ఆవేదన.. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ! కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో నిరుద్యోగులకు ఉపయోగం నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నాగోల్‌ హత్య కేసును ఛేదించిన ఎస్‌ఓటీ, నాగోల్‌ పోలీసులు తిరుమలలో నేత్రపర్వంగా శ్రీవారి స్నపన తిరుమంజనం.. విశేష పూజలు తాండూరులో దొంగల దండయాత్ర...! బిగ్‌బాస్ హౌస్‌లో హీటెక్కిన వాతావరణం.. రంజుగా మారిన పదో రోజు ఆట! గాజులదిన్నె ప్రాజెక్టులో పోలీసుల గణేష్ నిమజ్జనం స్కూల్ విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షల షెడ్యూల్ విడుదల.. దసరా సెలవులు ఎప్పుడంటే? అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ సెకండ్ సాంగ్ విడుదల.. అక్టోబర్ 9న థియేటర్లోకి పుట్టుకతోనే మరుగుజ్జులు .. జీవనోపాధి కోసం ఎదురుచూపులు! *ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆవేదన* నవంబర్ 14న ‘మెస్సి’ సినిమా విడుదల.. స్కూల్ పిల్లల చేతుల మీదుగా గ్లింప్స్ లాంచ్ ఎంపీపీని పరామర్శించిన బుట్టా దంపతులు ఆస్పత్రి బెడ్‌పై సీనియర్ నటి డిస్కో శాంతి.. వైరల్ అవుతున్న ఫొటో!

నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Select Suryaa Now
నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కార్యాలయ ముట్టడికి యత్నించిన బాధిత రైతులు.. అదనపు వసూళ్లపై తీవ్ర ఆరోపణలు
“రిజిస్ట్రేషన్‌కు ఓ రేటు.. ఫైల్ కదలాలంటే మరో రేటు” అంటూ ఆగ్రహం
పోలీసుల మోహరింపు.. సమగ్ర విచారణకు రైతుల డిమాండ్
 

నిజాంపేట్ ; సంగారెడ్డి జిల్లా, నిజాంపేట్:
నిజాంపేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల రిజిస్ట్రేషన్, ఇతర రెవెన్యూ పనుల విషయంలో తమ నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారంటూ పలువురు బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
ఒక్క ఎకరం భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. “రిజిస్ట్రేషన్‌కు ఒక రేటు.. ఫైల్ కదలాలంటే మరో రేటు” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాంపేట్‌లోని మీ సేవ కేంద్రం నిర్వాహకుడి ద్వారా మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను కూడా బాధితులు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వ్యవహారశైలిపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ నాగజ్యోతిపై కూడా బాధితులు ఆరోపణలు చేశారు.
డబ్బులు చెల్లించకపోతే తమ రిజిస్ట్రేషన్, ఫైళ్లకు సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అక్కడ మోహరించారు. రైతులు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.