BREAKING
దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ భారతదేశం అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్కెట్ టాటా సన్స్‌లో మరోసారి ముదిరిన వివాదం పోలీసు ఉద్యోగార్థుల కీలక విజ్ఞప్తి.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ రాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నారా.. అయితే ఈ ఆరోగ్య విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జైత్రయాత్ర: ఇండోనేషియాపై పురుషులు, ఫిన్‌లాండ్‌పై మహిళల జట్టు ఘన విజయం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మారనున్న వాతావరణం.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ముంబై అంబానీ ఇంట గణేష్ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడి కూతురు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన టిఫనీ ట్రంప్ మహేష్ బాబు ఇంట్లో గణేష్ నిమజ్జనం.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఎస్వీబీసీని ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా నడిపించాలి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భీమేశ్వరుడి హుండీకి భారీ కానుకలు పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.. ఇంతకీ 'ద్రుజ్బా దోస్తీ' అర్థం ఏమిటంటే!

తాండూరులో దొంగల దండయాత్ర...!

Select Suryaa Now
తాండూరులో దొంగల దండయాత్ర...!


పది రోజుల్లో నాలుగు చోరీలు.. పట్టపగలే మరో భారీ దొంగతనం
10 తులాల బంగారం.. రూ.3 లక్షల నగదు అపహరణ
కూతురి కాలేజీ ఫీజు కోసం దాచిన డబ్బు కూడా గాయబ్
వరుస ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు.. పోలీసులకు సవాల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 16): తాండూరు పట్టణ పరిసరాల్లో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా బుధవారం పట్టపగలే మరో భారీ చోరీ జరగడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
అయ్యప్పనగర్‌లో పట్టపగలే చోరీ

కోకట్ రోడ్డు మార్గంలోని అయ్యప్పనగర్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదును అపహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తమ కుమార్తె కాలేజీ ఫీజు చెల్లించేందుకు ఎంతో కష్టపడి దాచుకున్న నగదు సైతం దొంగల పాలవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి దొంగలు నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగంలోకి పోలీసులు

చోరీ విషయం తెలుసుకున్న వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ, ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.

వరుస ఘటనలతో కలవరం

ఇదిలా ఉండగా ఈ నెల 3, 14 తేదీల్లోనూ తాండూరు పరిసరాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తాజాగా అయ్యప్పనగర్‌లో పట్టపగలే చోరీ జరగడంతో వరుస ఘటనలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

భద్రత పెంచాలని విజ్ఞప్తి

వరుస చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పట్టణం, పరిసర ప్రాంతాల్లో గస్తీని పెంచి ప్రజలకు భద్రతా భావం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చోరీల పరంపర రూరల్ పోలీసులకు సవాల్‌గా మారిందని, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.