|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 08:18 PM
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా. మద్యం తాగి బస్సు నడుపుతున్న డ్రైవర్. రోజు ఇలా మద్యం తాగి వస్తాడు అంటూ ఏడుస్తూ చెబుతున్న విద్యార్థులు. 107 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 40 మంది విద్యార్థులకు గాయాలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు.. తీవ్ర గాయాలపాలైన 40 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలింపు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థుల ఆరోపణ, కాలువలో నీళ్లు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండడంతోనే అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసుల అంచనా