![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 04:07 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 643.96 పాయింట్లు లేదా 0.79 శాతం పడిపోయి 80,952.67 వద్ద, నిఫ్టీ 203 పాయింట్లు లేదా 0.86 శాతం పడిపోయి 24,601.25 వద్ద ముగిసాయి.కాస్మో ఫస్ట్, జై భారత్ మారుతి, నహర్ పాలీ ఫిల్మ్స్, రామ్కో సిస్టమ్, అలికాన్ కాస్టల్లాయ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్కే స్వామి, వడిలాల్ ఇండస్ట్రీస్, లింకన్ ఫార్మాస్యూటికల్స్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, గీకీ వెంచర్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 225 పాయింట్లు దిగజారి 24,587కు చేరింది. సెన్సెక్స్(Sensex) 736 ప్లాయింట్లు పడిపోయి 80,813 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.51 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.89 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్తో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.61 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.41 శాతం పడిపోయింది.