కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.
కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి.
10 వేల గ్రామాలలో 13,000 ఎకరాలలో
రీ సర్వే ప్రక్రియ పూర్తి.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్..
మెదక్ ; జిల్లాలో జరుగుతున్న కాడాస్ట్రల్ రీ-సర్వే పనులను నిర్దేశిత కాలవ్యవధిలో అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం , కలెక్టరేట్ కార్యాలయంలో కాడాస్ట్రల్ రీ-సర్వే నిర్వహణ పురోగతిని అదనపు కలెక్టర్ నగేష్,డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్, ఏడి ల్యాండ్ సర్వే కిషన్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ రామకృష్ణ తూప్రాన్ బావయ్య సంబంధిత తాసిల్దారులు, సర్వేర్లతో మెదక్ జిల్లాలో రీ సర్వే పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 10 వేల గ్రామాలలో 13,000 ఎకరాల రీ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.అలాగే సర్వే బృందాల రోజువారీ పనితీరు, ప్రతి బృందం పురోగతి, రోజుకు పూర్తి చేస్తున్న విస్తీర్ణం, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని చెప్పారుసర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా పనులు చేపట్టాలని సూచించారు.ఈ కాడాస్ట్రల్ రీ-సర్వే కార్యక్రమం భూ రికార్డులను శాస్త్రీయంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు