ఉత్తమ PSHM కు సన్మానము*
రాయమాల్పురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల H.M లక్ష్మణ్ నాయక్ కు ఇటీవల ప్రభుత్వం జిల్లా ఉత్తమ PSHM గా అవార్డ్ వచ్చిన సందర్భంగా పాఠశాల స్టాఫ్, గ్రామస్తులు, తల్లిదండ్రులు, పోలూరు క్లస్టర్ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. క్లస్టర్ H.M వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లక్ష్మణ్ నాయక్ గతంలో పనిచేసిన పాఠశాలల్లో మంచి H.M గా పేరుందని రాయమాల్పురం పాఠశాలను సంవత్సర కాలానికే దాదాపు 15 లక్షలు వివిధ గ్రాంట్లు& దాతల ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చారని ముఖ్యంగా పాఠశాల పేరెంట్స్ తో మంచి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటారని పాఠశాల మ్యాగజైన్ ముద్రించి స్టాఫ్ అందరూ డోర్ టు డోర్ తిరిగి ఆంగ్ల మీడియం తరగతికి ఒక ఉపాధ్యాయుడు విషయాన్ని గ్రామంలోని తీసుకెళ్ళి ఈ సంవత్సరం 31 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో ఎక్కువగా నమోదు చేశారని రాష్ట్ర అవార్డ్ కూడా సాధించాలని ఆకాంక్షించారు ప్రభుత్వం జిల్లా బెస్ట్ PSHM గా అవార్డు కు ఖచ్చితంగా అర్హులనీ తెలిపారు..సన్మాన కార్యక్రమము లో పాఠశాల స్టాఫ్ ఓబయ్య, అనంత లక్ష్మీ, సుజాత,సత్యవతమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వర్ణశ్రీ, క్లస్టర్ ఉపాధ్యాయులు వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, మహీంద్రా రెడ్డి,రమణ యాదవ్, వెంకటేశ్వర్లు పాఠశాల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.