BREAKING
ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధుల కేటాయింపు.ఎమ్మెల్యే ప్రశాంతమ్మను రాజమాత అన్నాను.. అది తప్పు అనుకుంటే పెద్దమ్మ అని పిలుస్తాను... మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా.

సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు

Select Suryaa Now
సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు

 సూర్యా న్యూస్ డెస్క్

ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని, ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల ఇబ్బందులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ సమస్యలు మరియు సెక్షన్ 22ఏ తదితర కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం తప్పుకుంటోందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యూరియా కొరతతో పాటు కరెంట్ కోతలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యాన్ని మార్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

సభలో ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక, కావాలనే సస్పెన్షన్ల అస్త్రం ప్రయోగిస్తున్నారని హరీష్‌రావు దుయ్యబట్టారు. తాము సభలో ప్రశ్నించకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా పాలకులు ప్రచార ఆర్భాటాలు మాని, క్షేత్రస్థైస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.