శామీర్పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువకులు వేములవాడ నుండి హైదరాబాద్ శామీర్పేట్ సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో చందు, రాకేష్, గౌతమ్, కళ్యాణ్ అనే యువకులు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.యువకుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.