BREAKING
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా ఆచార్య వినోబా భావే 131వ జయంతి వేడుకలు *కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కొంతమంది అధికారులపై ఆగ్రహం.. భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్! శామీర్‌పేట్ వద్ద వేములవాడ యువకులకు రోడ్డు ప్రమాదం సీఎం రేవంత్‌ది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్: హరీష్‌రావు తీవ్ర విమర్శలు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం.. తొలివారమే చైత్ర రాయ్ ఎలిమినేషన్? శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.?

ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు

Select Suryaa Now
ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు  14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు
14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
 
పటాన్‌చెరు :  శ్రీ గణేశ్ దేవస్థానం (సిద్ధి వినాయక) ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేష్ గడ్డ, రుద్రారం, మండలం పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లాలోని దేవస్థానంలో సెప్టెంబర్ 14 నుంచి 25వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. 
 
సెప్టెంబర్ 14న ప్రారంభం:
బ్రహ్మోత్సవాల ప్రారంభ కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం వరుసగా పలు రోజులపాటు స్వామివారికి వివిధ సేవలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 25న ప్రత్యేక కార్యక్రమాలు:
బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. 
 
ప్రత్యేక సేవలకు విరాళాలు.
దేవస్థానం సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ స్థాయిల్లో విరాళాలను అందించే అవకాశం కల్పించారు.స్వర్ణపుష్ప పోషకులు – రూ.1,00,000,మహారాజ పోషకులు – రూ.51,000,రాజ పోషకులు – రూ.25,000
పోషకులు – రూ.11,116,అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాత స్ఫూర్తితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. 
భక్తులు, దాతలు, ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం నిర్వాహకులు కోరారు.