గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్లైన్లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు మండప నిర్వాహకులు సహకరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు.
గణేష్ మండపాల నిర్వాహకులందరూ అవసరమైన సమాచార ఫారమ్లు, సంబంధిత పత్రాలను తెలంగాణ పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆన్లైన్లో వివరాల సమర్పణకు:
తెలంగాణ పోలీసు అధికారిక వెబ్సైట్
https://policeportal.tspolice.gov.in/index.htm