మార్నింగ్ వాక్ లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ సందడి
వాకర్స్ మధ్యలో ‘పైలెట్’ సందడి.. విలియమ్ మూన్ గ్రౌండ్లో ఆత్మీయ పలకరింపులు
తాండూర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 6): తాండూర్లోని విలియమ్ మూన్ గ్రౌండ్ ఆదివారం ఉదయం వాకర్స్తో సందడిగా మారింది. అదే సమయంలో గ్రౌండ్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
ఉదయపు చల్లని గాలిలో గ్రౌండ్ చుట్టూ వాకింగ్ చేస్తూ మధ్య మధ్యలో వాకర్స్ను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వాకర్స్లో ఒకరిగా కలిసిపోయి వారితో సరదాగా ముచ్చటించడం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పలువురు వాకర్స్ పైలెట్ రోహిత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. “మీరు మళ్లీ గెలవాలి.. మాకు అండగా ఉండాలి” అంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. కొందరు వాకర్స్ ఆయనతో కలిసి కాసేపు నడుస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. దీంతో విలియమ్ మూన్ గ్రౌండ్లో ఉదయం వేళ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.