BREAKING
ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా క్షిపణి దాడులు రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల పునరుద్ధరణ ఏథెన్స్ ఎయిర్ షోలో విషాదం ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల విరుచుకుపాటు పాకిస్తాన్ నిరంతరం ప్రధాన భద్రతా సమస్యే నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల కలకలం గుర్తింపు లేని మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉక్కుపాదం డెహ్రాడూన్‌లో పోలీసుల 'బుల్డోజర్' యాక్షన్ SDRF వీరోచిత రెస్క్యూ.. ముగ్గురి ప్రాణాలు కాపాడిన బలగాలు నేపాల్ చిలిమే సొరంగంలో వీరోచితంగా భారత సహాయక చర్యలు అహ్మదాబాద్ విమానాశ్రయంలో రూ. కోట్ల విలువైన గంజాయి సీజ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘ఓజీ’, ‘ధురందర్’ ఎస్ఆర్సీసీ వేదికగా జెన్ జెడ్ యాసతో ఆకట్టుకున్న ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ సడన్ సర్ ప్రైజ్ ‘మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు?’

రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల పునరుద్ధరణ

Select Suryaa Now
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల పునరుద్ధరణ

మాస్కోలో పుతిన్‌తో అమెరికా బృందం భేటీ
మూడు రోజుల పాటు దాడుల విరామం
మాస్కో: సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం క్రెమ్లిన్‌లో అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి సాధారణమైనది కాదని పేర్కొన్న పుతిన్, ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు.

అమెరికా ప్రతినిధుల పర్యటన నేపథ్యంతో పాటు శాంతి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించేందుకుగానూ ఉక్రెయిన్, రష్యాలు తమ ఇరు దేశాల రాజధానులపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు అంగీకరించాయి.

శనివారం అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై ఎటువంటి దాడులు చేయవద్దని పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా, సోమవారం వరకు మాస్కోపై దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు.

మాస్కోలో పుతిన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం, స్టీవ్ విట్‌కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించి జెలెన్స్కీతో భేటీ కానున్నారు. శాంతి చర్చలకు ముందే ఇరు దేశాలు దాడులను తీవ్రతరం చేశాయి. శుక్రవారం కీవ్‌లోని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (SBU) ప్రధాన కార్యాలయంపై రష్యా డ్రోన్ దాడి చేయగా, రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది.

దక్షిణ ద్నీప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని లోహ శుద్ధి కర్మాగారాలు, పారిశ్రామిక కేంద్రాలపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ఐదుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కీవ్, బోరిస్పిల్ ప్రాంతాల్లోని నివాస భవనాలపైనా దాడులు జరిగాయి. శాంతి ప్రయత్నాలకు తమ వైపు నుంచి ఎలాంటి ఆటంకం ఉండదని, ఈ పర్యటన ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.