BREAKING
ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ ఘనంగా వినాయక చవితి వేడుకలు గుంటూరు మేయర్ రేసులో మాదాల చైతన్య ఘనంగా వినాయక చవితి వేడుకలు మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణి నంద్యాలలో తాగునీటి సరఫరాలో అంతరాయం

రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Select Suryaa Now
రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ....  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

సూర్య కరీంనగర్ ప్రతినిధి :
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ తిప్పాపూర్ గోశాలలో సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా జతల కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం ప్రారంభించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ అర్హులను ఎంపిక చేసి కోడెలను అందజేస్తున్నట్లు తెలిపారు.కోడెలను రైతులు బాధ్యతగా సంరక్షించాలని, అక్రమ తరలింపులకు పాల్పడితే చర్యలు తప్పవని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. భక్తులు పాలు మరవని చిన్న కోడెలు, జెర్సీ జాతి కోడెలను సమర్పించకుండా, ఆరోగ్యంగా ఎదిగిన దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు. వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో నిర్ణీత రుసుం చెల్లించి నిజ కోడెను సమర్పించే అవకాశం ఉందన్నారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్‌బీ కుమారి, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.