గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి
సూర్య బిక్కనూర్:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీనాథ్(58) అనే వ్యక్తి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మండల విద్యా వనరుల అధికారి రాజాగంగారెడ్డి తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లిన శ్రీనాథ్ గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా శ్రీనాథ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు