BREAKING
పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’ పోఖ్రాన్‌లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం భూటాన్‌లో భారత సీఈసీ పర్యటన హైటెక్ సిటీలో దంచికొట్టిన వర్షం: నీట మునిగిన రోడ్లు.. మూసివేసిన అధికారులు భక్తులతో కిటకిటలాడుతున్న బాలాపూర్ గణేష్ మండపం: పూరి జగన్నాథ ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణ మొబైల్స్ ప్రియులకు గుడ్ న్యూస్: స్మార్ట్‌ఫోన్లపై జీఎస్టీ తగ్గింపునకు పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: వాట్సాప్‌లోనూ EPFO అధికారిక అప్‌డేట్స్ తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ: రేపు ధ్వజారోహణం

సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి..

Select Suryaa Now
సింగరేణిలో వేధింపుల ఆరోపణలు..  అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు..   చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి..

సూర్య-గోదావరిఖని:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం లెనిన్‌నగర్‌కు చెందిన మైనింగ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని తాండ్ర అక్షిత రాణి(20) సింగరేణిలో అప్రెంటిస్‌షిప్‌ సందర్భంగా ఎదురైన వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందడం కలకలం రేపుతోంది.జీడీకే-2 ఇంక్లైన్‌లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్న సమయంలో ఓవర్‌మెన్‌ బొమ్మకంటి రవికుమార్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని అక్షిత రాణి ఏప్రిల్‌లో సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.కళాశాలలో చదువుతున్న సమయంలోనూ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వరుస వేధింపులు, తనకు జరిగిన అవమానంతో తీవ్ర ఆవేదనకు గురైన అక్షిత రాణి తన బాధను లేఖలో వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 12 న ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతదేహంతో దళిత సంఘాల నిరసన అక్షిత రాణి మృతిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం మృతదేహంతో కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు. రవికుమార్‌, నవీన్‌కుమార్‌తో పాటు ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్న సింగరేణి రామగుండం ఏరియా-1 జనరల్‌ మేనేజర్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి సింగరేణి యాజమాన్యం న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు.