BREAKING
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం బ్రిక్స్ ప్రకటనపై ఉరుగ్వే ప్రశంసలు పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ

Select Suryaa Now
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ

 

మంద జగన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం:—:


బీజేపీ మహంకాళి జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీగా నియమితులైన బందెల సత్యనారాయణను సికింద్రాబాద్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు మంద జగన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంద జగన్ మాట్లాడుతూ బందెల సత్యనారాయణకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత అవకాశాలను అందుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చింతకింది మల్లేష్, ఒగ్గు శ్రీధర్, మూల అరవింద్ కుమార్, కొమరయ్య మంద, ఈశ్వర్ మంద, కొండా కిషోర్ గౌడ్, సాయి చరణ్ గంగపుత్ర, చింతకింది సాయి కుమార్, మంద మురళి, గబ్బెట రాజు, చిదురాల శ్రీనివాస్, వైట్ల వెంకటాద్రి, వల్లపు కృష్ణమూర్తి, కర్నాటి ఆనంద్ కుమార్, తిరుమల రవి, తౌఠం సతీష్, దిండిగల శ్రీకాంత్, ఆనందాస్ కరుణాకర్, ఆమంచా రామకృష్ణ, తిరుమల సంతోష్, మంద పాపయ్య తదితరులు పాల్గొన్నారు.