గణపతికి సీఎం పూజలు
హైదరాబాద్ :వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.