BREAKING
ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం బ్రిక్స్ ప్రకటనపై ఉరుగ్వే ప్రశంసలు పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి బ్రిక్స్ సదస్సు విజయవంతం 'సముద్ర లక్ష్మణ' విన్యాసాలు పూర్తి చేసిన ఐఎన్ఎస్ మైసూర్ ఆసియా కప్ విజేతలకు రాష్ట్రపతి అభినందనలు కొబ్బరి పీచుతో గ్రామీణ మహిళల సాధికారత ఢిల్లీలో రూ. 13,800 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం

Select Suryaa Now
పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 4.82 శాతానికి చేరినట్లు కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ (MoSPI) వెల్లడించింది. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, సరుకుల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం 5.95 శాతంగా నమోదైంది.

పట్టణ ప్రాంతాల (4.31%) కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే (5.23%) ధరల భారం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక వివిధ రంగాల వారీగా పరిశీలిస్తే.. వ్యక్తిగత సంరక్షణ, అనుబంధ సేవల విభాగంలో అత్యధికంగా 15.17 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, రెస్టారెంట్ సేవలు 8.38 శాతం, రవాణా రంగం 4.60 శాతం మేర ప్రియమయ్యాయి. విద్యుత్, గ్యాస్, ఇంధనం 2.61 శాతంగా నమోదు కాగా, ఆరోగ్య రంగం అత్యల్పంగా 1.34 శాతంతో స్వల్పంగా పెరిగింది.