BREAKING
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సెక్రటరీగా బందెల సత్యనారాయణ మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం బ్రిక్స్ ప్రకటనపై ఉరుగ్వే ప్రశంసలు పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి

మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే

Select Suryaa Now
మట్టి గణపతి పర్యావరణానికి రక్ష: ఉప్పల్ ఎమ్మెల్యే

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల వినియోగం ఎంతో అవసరం: బండారి లక్ష్మారెడ్డి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చిలుక నగర్ లో  మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హాజరై మట్టి వినాయకులను భక్తులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందుకే పర్యావరణహితమైన మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకృతిని పరిరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత పద్ధతులను పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

“భక్తితో బప్పాను స్వాగతిద్దాం… మట్టి వినాయకుడిని పూజించి ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దోహదపడింది.

ఈ కార్యక్రమంలో BRS పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు.