BREAKING
లండన్ వేదికగా మెరిసిన సీఎం విజయ్: తమిళనాడుకు రూ. 11,000 కోట్ల భారీ పెట్టుబడులు మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా? PSGకి ఈ సీజన్‌లో తొలి విజయం ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్ యూఎస్ ఓపెన్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్ బేగంబజార్‌లో 48 కిలోల బంగారు గణేశుడు.. 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో ప్రత్యేక అలంకరణ భారత్ ఖాతాలో ఎనిమిదో ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం బ్రిక్స్ ప్రకటనపై ఉరుగ్వే ప్రశంసలు పెరిగిన రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి బ్రిక్స్ సదస్సు విజయవంతం 'సముద్ర లక్ష్మణ' విన్యాసాలు పూర్తి చేసిన ఐఎన్ఎస్ మైసూర్

మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా?

Select Suryaa Now
మసూద్‌ అజర్‌పై పాక్‌ రివార్డు పెంపు: అంతర్జాతీయ నిఘాకు కన్నుగప్పే సరికొత్త డ్రామా?

 జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజర్‌పై రివార్డును పాకిస్థాన్‌ రూ.70 లక్షలకు పెంచింది. వచ్చే నెలలో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ (FATF) కీలక సమావేశం వేళ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే పాక్‌ ఈ సరికొత్త నాటకానికి తెరతీసిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్‌ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని బురిడీ కొట్టించే ఎత్తుగడ వేసింది. జైషే మహ్మద్‌ అధినేత, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజర్‌పై ఉన్న రివార్డును రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాక్‌ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) విడుదల చేసిన తాజా ‘రెడ్‌ బుక్‌’లో అతడి పేరును చేర్చింది.
పుల్వామా దాడి సూత్రధారి అయిన అజర్‌ తమ దేశంలోనే లేడంటూ పాక్‌ ఇన్నాళ్లూ వాదిస్తూ వచ్చింది. అయితే, వచ్చే నెలలో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (FATF) కీలక సమావేశం జరగనుంది. ఉగ్ర నిధుల కట్టడిలో విఫలమైతే మళ్లీ గ్రే లిస్ట్‌ లేదా కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే పాక్‌ ఈ చర్య చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
తాజా రెడ్‌ బుక్‌లో ముంబై 26/11 దాడులకు సహకరించిన మరో 19 మంది పేర్లను కూడా పాక్‌ చేర్చింది. వీరంతా ఏళ్ల తరబడి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి పాక్‌ నిఘా సంస్థల నీడలోనే సురక్షితంగా ఉన్నారని భారత నిఘా వర్గాలు మొదటినుంచీ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అజర్‌ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షా నగరంలోనే తలదాచుకున్నట్లు సమాచారం.
గత ఐదేళ్లలో ఎఫ్‌ఐఏ రెడ్‌ బుక్‌లోని ఉగ్రవాదుల సంఖ్య 1,330 నుంచి 1,804కు (దాదాపు 35%) పెరిగింది. ఉగ్రవాదులను ఏరివేయడం కంటే, కేవలం జాబితా పరిమాణాన్ని పెంచి చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించుకోవడమే పాక్‌ లక్ష్యం. ఉగ్రవాదులకు ఒకవైపు ఆశ్రయం కల్పిస్తూనే, మరోవైపు రివార్డుల పేరుతో నటన కొనసాగించడం పాక్‌ ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టింది.