BREAKING
అంతరిక్ష ఆయుధీకరణను నివారించాలి బలమైన ఐసీటీ సహకారం, సైబర్ నేరాలు, డీప్‌ఫేక్‌లపై కఠిన చర్యలకు పిలుపు సరిహద్దుల వద్ద శాంతి, వాణిజ్య అసమతుల్యతల నివారణే లక్ష్యం సాగర్ పిక్చర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్: 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం’ సినిమాటిక్ యూనివర్స్! కోలీవుడ్‌లో కృతి శెట్టికి ఎదురుదెబ్బలు: ‘జీని’తోనైనా విజయం దక్కేనా? పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ క్లీన్ స్వీప్: మూడో టెస్టులో 8 వికెట్లతో విజయం! అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20: ఇషాన్ కిషన్ గాయంపై క్లారిటీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ బ్రిక్స్ సమగ్ర అజెండాకు ప్రధాని మోదీ పిలుపు భారత్ బ్రిక్స్ అధ్యక్షతకు ప్రపంచ నేతల ప్రశంసలు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! ఉగ్రవాద నిరోధంలో ద్వంద్వ ప్రమాణాలు వీడాలి వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష: మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటన పశ్చిమ పసిఫిక్ సముద్రగర్భంలో అపార స్వర్ణ నిక్షేపాలు: చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు ఇంగ్లండ్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, అజిత్ కలయిక: పచ్చజెండా ఊపిన సీఎం విజయ్ అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: అణు విమర్శలను తిప్పికొట్టిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

పశ్చిమ పసిఫిక్ సముద్రగర్భంలో అపార స్వర్ణ నిక్షేపాలు: చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు

Select Suryaa Now
పశ్చిమ పసిఫిక్ సముద్రగర్భంలో అపార స్వర్ణ నిక్షేపాలు: చైనా పరిశోధకుల సంచలన గుర్తింపు

సూర్యా న్యూస్ డెస్క్

పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర గర్భంలో బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలను చైనా పరిశోధకులు కనుగొన్నారు. 18 రోజుల పాటు సాగిన సుదీర్ఘ సముద్ర పరిశోధనల్లో లభ్యమైన శాంపిళ్ల విశేషాలపై ప్రత్యేక కథనం.


సముద్ర గర్భంలో దాగివున్న ప్రకృతి సంపదను వెలికితీసేందుకు సాగుతున్న పరిశోధనల్లో చైనా శాస్త్రవేత్తలకు భారీ విజయం లభించింది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం అడుగున అత్యంత విలువైన అపార బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు చైనా పరిశోధ బృందం గురింపును అధికారికంగా వెల్లడించింది. భూభాగంపై లభించే నిల్వలతో పోలిస్తే ఇవి పరిమాణంలో ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ పరిశోధనల కోసం సైంటిస్టుల బృందం ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభించి సుమారు 18 రోజుల పాటు పసిఫిక్ సముద్రంలో సుదీర్ఘ అన్వేషణ సాగించింది. సముద్ర గర్భంలో లోతైన ప్రాంతాల నుంచి సేకరించిన ముడి పదార్థాల శాంపిళ్లను ప్రయోగశాలల్లో విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనల్లో లభ్యమైన ప్రతి ఒక టన్ను ముడి ఖనిజంలో 15.4 పిపిఎమ్ (గ్రాములు) బంగారం, అలాగే 1,271 పిపిఎమ్ (గ్రాములు) వెండి నిల్వలు ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది.

సముద్రపు లోతుల్లో సంభవించే భౌగోళిక ప్రక్రియల కారణంగా ఏర్పడిన ఈ ఖనిజ నిక్షేపాలు అత్యంత నాణ్యమైనవిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిక్షేపాలను వెలికితీసేందుకు సంబంధించి మరింత విస్తృత స్థాయి అధ్యయనాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ జలాల్లో ఈ తరహా విలువైన లోహాల గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ మరియు పరిశోధనా రంగాల్లో కొత్త ఆసక్తికి దారితీస్తోంది.