పోఖ్రాన్లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం
జైసల్మేర్: అధునాతన మానవరహిత వ్యవస్థలను పరీక్షించేందుకు భారత వైమానిక దళం (IAF) పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తొలి ‘డ్రోనథాన్-2026’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ప్రారంభించారు.
ఈ ప్రదర్శనలో 20కి పైగా రక్షణ సంస్థలు, స్టార్టప్లు భాగస్వామ్యమయ్యాయి. ఈ సందర్భంగా వైమానిక దళ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ‘ఐఏఎఫ్ యూఏఎస్ రోడ్మ్యాప్’ను విడుదల చేయడంతో పాటు, గగనతల పర్యవేక్షణ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘వాయు ఉత్తమ్’ అనే డ్రోన్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా ప్రదర్శించారు.