ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం
న్యూఢిల్లీ:శాస్త్రీయ ఆధారాలు, నాణ్యతా ప్రమాణాలు మరియు ఆవిష్కరణల ఆధారంగా ఆయుర్వేదం వేగంగా ప్రపంచ వృద్ధి పథంలోకి అడుగుపెడుతోంది. "ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం" అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 23న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది. గత దశాబ్దంలో ఆయుష్ మార్కెట్ 2014లోని 2.85 బిలియన్ డాలర్ల నుండి 2023 నాటికి 43.4 బిలియన్ డాలర్లకు ఎగబాకగా, ఎగుమతులు 2.16 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
ఎన్ఎస్ఎస్ఓ (NSSO) సర్వే ప్రకారం దేశంలో 95 ശాతానికి పైగా ప్రజలకు ఆయుష్పై అవగాహన ఉండగా, 50 శాతానికి పైగా ప్రజలు చికిత్స నిమిత్తం ఆయుర్వేదాన్ని వినియోగిస్తున్నారు. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక 'ఆయుష్ వీసా'ను ప్రవేశపెట్టింది. నీతి ఆయోగ్ 2047 లక్ష్యంగా 'ఆయుర్వేదం రోడ్మ్యాప్'ను విడుదల చేయగా, గుజరాత్లోని జామ్నగర్లో 250 మిలియన్ డాలర్లతో డబ్ల్యూహెచ్ఓ (WHO) ప్రపంచ సాంప్రదాయ వైద్య కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేసింది.