భూటాన్లో భారత సీఈసీ పర్యటన
థింఫు: రెండు దేశాల మధ్య ఎన్నికల సహకారం, సంస్థాగత సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ మూడు రోజుల భూటాన్ పర్యటనను ప్రారంభించారు. సెప్టెంబర్ 14 నుండి 16 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా ఆయన థింఫులో భూటాన్ రాజుతో పాటు ప్రధాన మంత్రి డాషో షెరింగ్ తోబ్గేను కలవనున్నారు.
పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 15న పారోలోని జిగ్మే సింగ్యే వాంగ్చుక్ లా స్కూల్లో జరిగే భూటాన్ 'జాతీయ ఓటర్ల దినోత్సవ' వేడుకలకు సీఈసీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భారత ఎన్నికల సంఘం (ECI), భూటాన్ ఎన్నికల సంఘాల మధ్య ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ అనుభవాలను పంచుకోవడం మరియు ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.