మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్
నంద్యాల అర్బన్:నంద్యాలలోని మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్ గారిని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) సుధాకర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. సీజీఎం సుధాకర్ కుమార్ మంత్రి ఫరూక్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా స్థితిగతులు, విద్యుత్ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై వారు చర్చించారు. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకా వరప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకా వరప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు