BREAKING
*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*..... భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా...సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య టాలీవుడ్ నుంచి మరో కొత్త తరహా ఎంటర్‌టైనర్.. రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ రిలీజ్! టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా? ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్ కరీంనగర్‌లో 49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పోషకాహారం, ఏకాగ్రత, హాజరు పెంపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో 50 వేల మంది విద్యార్థుల సామ పార్టీలకు అతీతంగా బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి అండ

ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత

Select Suryaa Now
ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత

ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది

రిటైర్డ్ ఐఆర్ఎస్ లక్క భూషణం, ఎంఈఓలు బ్రహ్మం నాయక్, కోటయ్యలు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

నంద్యాల అర్బన్:

సమాజ నిర్మాత ఉపాధ్యాయుడే అని రిటైర్డ్ ఐఆర్ఎస్ లక్క భూషణం, నంద్యాల, పాణ్యం మండల విద్యాధికారులు బ్రహ్మం నాయక్, కోటయ్యలు అన్నారు.  సోమవారం రాత్రి పట్టణం లోని రోటరీ స్కూల్ నందు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ పొందిన నంద్యాల మండలం రాయమాల్పురం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్, పాణ్యం మండలం కొణిదేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్,  సిరివెళ్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సురేష్ లను ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన బ్రహ్మం, కోటయ్య, లక్కభూషణం ఆళ్లగడ్డ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నల్లమల రాజు, ఎస్.ఎ.పి.డి మరియు పీఈటి అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రవికుమార్, గౌరవాధ్యక్షులు కేశవ నాయక్ తదితరులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది అని అన్నారు.  ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం మరియు నాణ్యమైన విద్యను అందించి చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని వారు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తా మని తెలిపారు. అవార్డు గ్రహీతలను రోటరీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్యతో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సర్వేర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.