BREAKING
డేవిడ్ రెడ్డి చిత్రంలో కమలా రెడ్డిగా రమ్యకృష్ణ.. బర్త్ డే సందర్భంగా మాస్ లుక్ రివీల్! Anna Rajan ఎవరు? వీడియోలు ఎందుకు వైరల్? బ్రిక్స్ సదస్సులో సరికొత్త ‘సంగీత దౌత్యం’: బాలీవుడ్ పాటలతో ఆకట్టుకున్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం! *మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*..... భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా...సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య టాలీవుడ్ నుంచి మరో కొత్త తరహా ఎంటర్‌టైనర్.. రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ రిలీజ్! టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా? ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*.....

Select Suryaa Now
*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*.....


......
సూర్యాపేట: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి, పండుగను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు. పీఓపీ విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.అలాగే వినాయక మండపాల వద్ద పరిశుభ్రతను పాటించాలని, పూజా సామగ్రి, ఇతర వ్యర్థాలను రోడ్లపై పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సారగండ్ల శ్రీనివాస్ ముదిరాజ్ , ఎం.డి. గౌసుద్దిన్, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, ఏనేపల్లి యాదగిరి, ఇండ్ల మనోజ్,పిట్టల.శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, మేడి నాగరాజు, మధు, బిక్షం, హరీష్,మోర. నరేష్, బి. నాగరాజు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.