BREAKING
భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు వెండితెరపై సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సందడి.. రెండో అర్ధభాగంలో ట్విస్టులు అదుర్స్! నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో మట్టి గణపతి తయారీపై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో మట్టి గణపతి తయారీపై అవగాహన కార్యక్రమం


మట్టి గణపతినే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం.
అమీర్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతి వర్క్షాప్.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో అమీర్పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మట్టి గణపతి తయారీపై అవగాహన కార్యక్రమం, వర్క్షాప్ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రవీందర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవీందర్ నాయుడు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి గణపతులను ప్రోత్సహించాలని సూచించారు. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోవడంతో పాటు నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు. పత్రి ఆకుల్లోని సహజ గుణాలు నీటి నాణ్యతను కాపాడటానికి సహాయపడతాయని కార్యక్రమంలో ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.
వర్క్షాప్లో విద్యార్థులకు మట్టి గణపతి తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించి, పర్యావరణహితమైన గణపతి విగ్రహాలను వినియోగించాలని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టి గణపతులను తయారు చేశారు.
NCC అధికారి రామునాయక్, TGPCB ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఆర్. రాజేశ్వర్ రావు పిసిబి అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసి నిర్వహించారు
సెప్టెంబర్ 10
సీనియర్ సామాజిక శాస్త్రవేత్త (FAC)
TGPCB, సనత్నగర్