ఉత్తరాఖండ్ సీఎం ధామికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ:ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం (సెప్టెంబర్ 16) నాటితో 51వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రంగాల అభివృద్ధికి ధామి చేస్తున్న కృషిని, పేదల సాధికారత పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రశంసించారు. ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ధామికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితర పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సనాతన సంస్కృతి, ప్రజాసేవ పట్ల ధామి నిబద్ధతను వారు కొనియాడారు.
1975 సెప్టెంబర్ 16న జన్మించిన పుష్కర్ సింగ్ ధామి, 2021 జూలై 4 నుండి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంపావత్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఆయన, ఉత్తరాఖండ్లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నేతగా రికార్డు సృష్టించారు.