లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై:గత సెషన్లో భారీగా పడిపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో పుంజుకున్నాయి. విలువాధారిత కొనుగోళ్ల (వాల్యూ బయింగ్) మద్దతుతో ప్రారంభంలో 30 షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ 244.02 పాయింట్లు పెరిగి 74,293.25 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 23,201.85 వద్ద ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ 30 కంపెనీల్లో మహీంద్రా & మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా లాభపడగా.. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, టాటా స్టీల్, టిసిఎస్, ఎటర్నల్ కంపెనీల షేర్లు నష్టాల్లో పయనించాయి. ఆసియా మార్కెట్లలో కొరియా కోస్పి, జపాన్ నిక్కీ, షాంఘై, హాంగ్కాంగ్ సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.
అయినప్పటికీ, పెరిగిన ముడి చమురు ధరలు (బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 108.1 డాలర్లు), విదేశీ నిధుల మళ్లింపు (మంగళవారం FIIలు రూ. 2,977.86 కోట్ల షేర్ల విక్రయం) మార్కెట్ ర్యాలీని కొంత నిరోధించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నేడు ప్రకటించనున్న వడ్డీ రేట్ల నిర్ణయం, ఫెడ్ ఇచ్చే మార్గదర్శకాలపైనే మార్కెట్ల తదుపరి గమనం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 777.94 పాయింట్లు, నిఫ్టీ 279.50 పాయింట్లు పడిపోయి దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయి వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.