BREAKING
రష్యా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భారత్‌ ఒక బాధ్యతాయుతమైన భద్రతా భాగస్వామి బీహార్‌లో వరద తీవ్రత...కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తృత పర్యటన ఉత్తరాఖండ్ సీఎం ధామికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భూటాన్‌లో జైశంకర్ పర్యటన మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ కూల్చివేత: సౌదీ సంకీర్ణ దళాలు లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ ఇరాన్ యుద్ధ వ్యయం 38 బిలియన్ డాలర్లు హౌతీల విజృంభణ అక్టోబర్ 2 నుంచి గ్రామీణ నీటి వనరుల జియో-ట్యాగింగ్, పరీక్షలు ప్రాణం పోయాక వస్తారా డాక్టర్లు...?! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ తుఫాను ఢీ కొట్టిన ఎక్సైజ్ సీఐ గారు కరీంనగర్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమానికి శ్రీకారం వెటర్నరీ డాక్టర్ నియామకానికి దేవాదాయ శాఖ అంగీకారం

అక్టోబర్ 2 నుంచి గ్రామీణ నీటి వనరుల జియో-ట్యాగింగ్, పరీక్షలు

Select Suryaa Now
అక్టోబర్ 2 నుంచి గ్రామీణ నీటి వనరుల జియో-ట్యాగింగ్, పరీక్షలు

న్యూఢిల్లీ: గ్రామీణ నీటి సరఫరా వనరుల జియో-ట్యాగింగ్ తో పాటు వర్షాకాలం తర్వాత నీటి నాణ్యత పరీక్షలను అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదే రోజున వీలైనన్ని ఎక్కువ గ్రామ పంచాయతీలలో 'జల్ అర్పణ్' కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. జల్ జీవన్ మిషన్ (JJM) 2.0 అమలు తీరుపై తాగునీరు, పారిశుధ్య విభాగం (DDWS) నిర్వహించిన 12వ 'పేజల్ సంవాద్' వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి అశోక్ కె.కె. మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమాలలో పాల్గొనే గ్రామ పంచాయతీల వివరాలను సెప్టెంబర్ 20లోగా అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు. నీటి సరఫరా ఆస్తులను గ్రామ పంచాయతీలకు అప్పగించడాన్ని 'జల్ అర్పణ్' సూచిస్తుందని, దీనివల్ల సామాజిక యాజమాన్యం, సుస్థిర నిర్వహణ పెరుగుతాయని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, జేజేఎం 2.0 నిధులను సకాలంలో వినియోగించాలని సూచించారు.

ఈ సమావేశంలో వివిధ జిల్లాల వినూత్న పద్ధతులను ప్రదర్శించగా, నేషనల్ జల్ జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ జిల్లాల పనితీరును అభినందించారు. నైపుణ్యాభివృద్ధి, 'నల్ జల్ మిత్ర' కార్యక్రమాలపై జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. 2019 ఆగస్టు 15న ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ గృహానికి సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.