రష్యా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్
న్యూఢిల్లీ: భారత్-రష్యాల మధ్య రక్షణ, సైనిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు రష్యాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాస్కోలోని అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించనున్నారు.
పర్యటనలో భాగంగా రష్యా భూ బలగాల కమాండర్-ఇన్-చీఫ్ కల్నల్ జనరల్ ఆండ్రీ నికోలాయెవిచ్ మోర్ద్విచెవ్, ఉప రక్షణ మంత్రి వాసిలీ సెర్గేవిచ్ ఓస్మాకోవ్లతో పాటు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో జనరల్ సేథ్ సమావేశమవుతారు. అలాగే మాస్కోలోని జాతీయ రక్షణ నియంత్రణ కేంద్రాన్ని, సెయింట్ పీటర్స్బర్గ్లోని మిఖైలోవ్స్కాయా మిలిటరీ ఆర్టిలరీ అకాడమీని సందర్శించి సైనిక శిక్షణ, రక్షణ సంబంధాలపై చర్చించనున్నారు.