BREAKING
దివంగత నేత వైఎస్సార్‌ను తలుచుకుని భావోద్వేగానికి గురైన బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అందరూ కాక్రోచ్‌లే.. ఆ పోరాటంలో నేనూ ఒకడినే: వైఎస్ జగన్ కృత్రిమ మేధ ముప్పు: ఆంథ్రోపిక్ రీసెర్చర్ సంచలన రాజీనామా చిత్తూరు చిన్నారి అరుదైన ఘనత.. పొడవైన సహజ జుట్టుతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బండి జియా రెడ్డి ప్రజా పోరాట పాటల భాస్వరం.విమలక్క స్వరం అర్థ శతాబ్దపు సాంస్కృతిక ప్రస్థానంపై ప్రత్యేక కథనం నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు

కృత్రిమ మేధ ముప్పు: ఆంథ్రోపిక్ రీసెర్చర్ సంచలన రాజీనామా

Select Suryaa Now
కృత్రిమ మేధ ముప్పు: ఆంథ్రోపిక్ రీసెర్చర్ సంచలన రాజీనామా

సూర్యా న్యూస్ డెస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వేగవంతమైన అభివృద్ధి మానవాళికే పెను ప్రమాలంగా మారుతుందన్న ఆందోళనలు టెక్ రంగంలో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌లో పరిశోధకుడిగా పనిచేసిన జాకబ్ కాక్సన్ తన ఉద్యోగానికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత మూడేళ్లుగా ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలలో ప్రీట్రైనింగ్ రీసెర్చర్‌గా సేవలందించిన ఆయన, ఈ కంపెనీల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టెక్ దిగ్గజాలు భద్రతా ప్రమామాలను పూర్తిగా విస్మరించి, కేవలం స్వయం-అభివృద్ధి చెందే సూపర్ ఇంటెలిజెన్స్ కోసం గుడ్డిగా పరుగులు పెడుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై నియంత్రణ కొరవడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో ఏఐ వ్యవస్థలు మరింత శక్తివంతంగా మారి, ఎలాంటి పనులనైనా సులభంగా చేయగలవని, ఇది మానవ మనుగడకే ముప్పు తెస్తుందని జాకబ్ కాక్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. లాభాపేక్షతోనూ, పోటీ తత్వంతోనూ సాగుతున్న ఈ ప్రయోగాలు ప్రజల ప్రాణాలతో జూదం ఆడటమేనని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఏఐ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు బహిరంగంగా ఒకలా మాట్లాడినా, అంతర్గతంగా మాత్రం ముప్పుపై తీవ్ర భయంతో ఉన్నారని ఆయన వెల్లడించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ టెక్ రంగంలో నైతిక విలువల అమలు మరియు నియంత్రణపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ఏఐ అభివృద్ధిలో వేగం కంటే భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో మానవ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా హెచ్చరికలు టెక్ దిగ్గజాల అంతర్గత విధానాలపై సర్వత్రా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.