telanagana
చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది..
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ ఉద్యమం ఆగలేదని కరీంనగర్ జిల్లా ఉద్యోగుల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 8న నిర్వహించిన సన్నాహక సమావేశానికి సుమారు 5 వేల మంది హాజరయ్యారని, జిల్లాకు చెందిన 10 వేల మందికి పైగా ఉద్యోగులు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. పీఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 18వ తేదీ వరకు ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర జేఏసీ ప్రకటించే తదుపరి కార్యాచరణకు మరింత ఉత్సాహంతో సిద్ధమవుతామని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, ఇది వ్యూహాత్మక విరామమేనని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీజీవోల జిల్లా కార్యదర్శి అడ్ల అరవింద్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోటా రామస్వామి, పెన్షనర్ల సంఘం నాయకులు ఉస్మాన్ పాషా, కేశవరెడ్డి, ప్రభాకర్రావు, టీఎన్జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్కుమార్రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ ఆర్మీందర్ సింగ్, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్రెడ్డి, మహిళా నాయకులు ఈ. శారద, సునీత, సరిత, గంగారపు రమేష్, ఒంటెల ప్రసాద్రెడ్డి, రాజేష్, భరద్వాజ్, సుమంత్రావు, పోలు కిషన్, వాస్తవికు శ్రీమాన్రెడ్డి, సత్యనారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ, టీయూటీ, డీటీఎఫ్, ఎస్టీయూ, టీఆర్టీఎఫ్, టీజీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. 18వ తేదీ వరకు ఓపికగా ఉండి, అనంతరం రాష్ట్ర జేఏసీ ప్రకటించే కార్యాచరణకు ఐక్యంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.