BREAKING
నూకసాని బాలాజీ కి జన్మదిన శుభాకాంక్షలు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్ చలో హైదరాబాద్ వాయిదా.. 18 తర్వాత తదుపరి కార్యాచరణ.. ఉద్యోగుల అసంతృప్తి కొనసాగుతోంది.. కందకుర్తి పుష్కర ఘాట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అడ్డుకోలేరు – జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??.. న్యూఢిల్లీలో 'గ్లోబల్ డ్రైలాండ్ కాంగ్రెస్ 2026' ప్రారంభం యూఎస్ ఓపెన్ సెమీస్‌కు చేరిన అలెగ్జాండర్ జ్వెరెవ్ సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పుంజుకున్న ప్రపంచ వస్తు వాణిజ్యం చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్ బ్రెంట్ చమురు ధర $100 దాటడంతో కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్లు భారత ఆరోగ్య రంగాన్ని కొనియాడిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్ఐ చిర్ర.సతీష్

Select Suryaa Now
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, వాతావరణంలో నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి  ఎస్ఐ చిర్ర.సతీష్


సూర్య కమ్మర్ పల్లి :
గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కమ్మర్‌పల్లి మండల పరిధిలోని డీజే (DJ) ఆపరేటర్లు మరియు సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని స్థానిక  తహసీల్దార్  సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధిక శబ్దాలు చేసే డీజే సిస్టమ్‌లు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం ఉన్నందున, ఉత్సవాల సమయంలో వాటిని ఉపయోగించరాదని స్పష్టం చేశారు.
- గణేష్ మండపాల వద్ద గానీ, శోభాయాత్ర / నిమజ్జనం సమయంలో గానీ డీజే సిస్టమ్‌లు, బాక్స్ వాల్స్ ఉపయోగించరాదు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలను ఏర్పాటు చేస్తే, సంబంధిత డీజే ఆపరేటర్లపై చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు సౌండ్ పరికరాలను సీజ్ చేయడం జరుగుతుంది.ప్రజలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్ఐ కోరారు.