BREAKING
చరిత్రలోనే అత్యంత వేడి నెలగా ఆగస్టు మధ్యంతర ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు $5,000 'ట్రంప్ డివిడెండ్' మూడు నెలల చిన్నారికి అరుదైన గుర్తింపు.. 7–8.5 సెం.మీ సహజ జుట్టు $1,999 ధరతో ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను ఆవిష్కరించిన ఆపిల్ బ్రెంట్ చమురు ధర $100 దాటడంతో కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్లు భారత ఆరోగ్య రంగాన్ని కొనియాడిన డబ్ల్యూహెచ్ఓ అధిపతి అబుదాబిలో ఒడిశా కీలక ఒప్పందం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో అతివాద పార్టీ విజయం విదేశాంగ విధాన సాధనంగా అమెరికా ఆర్థిక శక్తి ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు త్వరలోనే పునఃప్రారంభం రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం బ్రిక్స్ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులను ఖండించిన భారత్ నేపాల్ వరద బాధితులకు భారత్ అండ మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ

రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

Select Suryaa Now
రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం

ప్రధాని మోదీ హర్షం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. 20,000 కోట్లకు పైగా విలువైన ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా మెరుగైన అనుసంధానం, వేగవంతమైన ప్రయాణికుల రాకపోకలతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని 17 జిల్లాలను కవర్ చేసే ఐదు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 10,021 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా రైల్వే నెట్‌వర్క్ 540 కిలోమీటర్ల మేర పెరగనుంది. 2029-30 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐదు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో రైలు సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తాయని, లక్షలాది మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని ప్రధాని ‘X’ ద్వారా తెలిపారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో రూ. 10,783 కోట్ల వ్యయంతో 656 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మూడు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల్లో అదనపు నెట్‌వర్క్‌ను పునర్నిర్మించడంతో పాటు వారసత్వ, వన్యప్రాణి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.